తప్పుడు వార్తలు ప్రచురించిన డెక్కన్ క్రానికల్‌కు పరువు నష్టం నోటీసులు జారీ చేసిన కేటీఆర్


తప్పుడు వార్తలు ప్రచురించిన డెక్కన్ క్రానికల్‌కు పరువు నష్టం నోటీసులు జారీ చేసిన కేటీఆర్

48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఉద్దేశపూర్వకంగా రాసిన ఆ కథనాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్

జూలై 8, 2026న ఫ్రంట్ పేజీలో ప్రచురితమైన “KTR’s ‘Landlord’ Builds Tower in Hussainsagar” అనే కథనం తన ప్రతిష్ఠను దిగజార్చేలా డెక్కన్ క్రానికల్ ఉద్దేశపూర్వకంగా రాసిందని పేర్కొన్న కేటీఆర్ తరఫు న్యాయవాదులు

హుస్సేన్‌సాగర్ సమీపంలో ఒక ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ ఈ కథనం తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొన్నా కేటీఆర్ న్యాయవాదులు

కనీస ఆధారాలు లేకుండా కేవలం ఆయన ప్రతిష్ఠను, విశ్వసనీయతను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ ఫేక్ న్యూస్ ప్రచురించారని అంటూ లీగల్ నోటీసులు

48 గంటల గడువులోగా సదరు పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన డిజిటల్ లింక్‌లను తక్షణమే తొలగించాలని డిమాండ్

అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించకూడదని స్పష్టం

ఈ షరతులను పాటించకపోతే, డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై తగిన సివిల్, క్రిమినల్ మరియు నష్టపరిహారం దావాలను వేస్తామని హెచ్చరిక

About The Author