పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య

పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు

రంగారెడ్డి జిల్లాలో దారుణం

షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్(28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి

మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా, ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్

బెయిల్‌పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో, కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చిన రాజ్ కుమార్

కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు సమాచారం

ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చిన రాజ్ కుమార్ తల్లిదండ్రులు

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

About The Author