విచక్షణారహితంగా వృద్ధ దంపతుల దారుణహత్య

చిత్తూరు జిల్లా రామకుప్పంలో జూలై 17, 2026 రాత్రి జరిగిన దారుణ ఘటనలో వృద్ధ దంపతులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బందార్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (67), పార్వతమ్మ ( 65) దంపతులు ఇద్దరు తమ సొంత పనుల నిమిత్తం శుక్రవారం రాత్రి రామకుప్పం కు వచ్చి ద్విచక్ర వాహనం లో తిరుగు ప్రయాణమయ్యారు. బందర్లపల్లి క్రాస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో తలలపై,మెడ భాగంలో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపారు.రక్తపు మడుగులో వెంకటేశప్ప, పార్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు . స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో డి.ఎస్.పి పార్థసారథి,కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సై వెంకట మోహన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

About The Author