అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం నుండి…


జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో గల అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం నుండి

వస్తున్న ప్రాణాపాయ డస్ట్ వల్ల గ్రామ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఉదయం లేవగానే ఇంటి ముందు,బయట ఉంచిన గాబులలో ఉన్న నీరు అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం వల్ల వస్తున్న డస్ట్ పేరకొని పోతుందని,

దీని వల్ల పశువులు నీరు త్రాగే పరిస్థితులు లేవని, మనుషుల మొహాలు డస్ట్ తో కూడుకొని పౌడర్ వేసినట్లు గ ఉంటుందని,

అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం వారు అర్థ రాత్రి పూట వదులుతున్న డస్ట్ వల్ల ఇప్పటికే ఊపిరితిత్తులు,

బ్లెడ్ ఇన్ఫెక్షన్,కిడ్నీలు,చర్మ సంబంధమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురౌతున్నామని ప్రజలు తెలియజేశారు.

స్థానిక ప్రజలను అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం డస్ట్ ను వదులుతూ జీవించే హక్కును కాలరాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైన ఎన్నోసార్లు అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యానికి, నాయకులకు సమస్యలను విన్నవించిన ఫలితం లేకపోవడంతో

కర్మాగారానికి సిబ్బంది వెళ్ళే బస్సును తప్పనిసరిగా ఆపాల్సి వచ్చిందని గ్రామ ప్రజలు తెలియజేశారు.

ఇప్పటికైన అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారం నుండి వచ్చే డస్ట్ నుండి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని జిల్లా అధికారులకు,అధికార పార్టీ నాయకులకు గ్రామ ప్రజలు మీడియా ద్వారా తెలియజేసారు.

About The Author