సీఎస్ఆర్ ఫలాలతో అభివృద్ధి…

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* సీఎం చంద్రబాబు కృషితో రాయలసీమకు పరిశ్రమల రాక
* పరిశ్రమల స్థాపనతో వెల్లువెత్తున్న సీఎస్ఆర్ ఫలాలు
* గ్రామాల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమం
* గత పాలకులకు సీఎస్ఆర్ అంటే తెలియదు
* కియా వెళ్లగొట్టడానికి జగన్ కుట్ర : మంత్రి సవిత
* రొద్దంలో రూ.6 కోట్లతో పీహెచ్సీ భవనానికి మంత్రి సవిత శంకుస్థాపన
* కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
*రొద్దం/శ్రీసత్యసాయి* : పెద్ద ఎత్తున పరిశ్రమ స్థాపనతో సీఎఎస్ఆర్ ఫండ్స్ వెల్లువెత్తుతున్నాయని, ఆ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన సాధ్యమవుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.పరిశ్రమలంటేనే సీబీఎన్ అని, సీబీఎన్ అంటే పరిశ్రమలని అన్నారు. గత పాలకులు పరిశ్రమలు వెళ్లగొట్టారని, వాళ్లకు సీఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏమిటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. పెనుకొండ నియోజక వర్గంలో సీఎస్ఆర్ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆసుపత్రి భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ, రొద్దంలో పీహెచ్సీ నిర్మాణానికి రూ.6 కోట్ల సీఎస్ఆర్ నిధులు అందజేసిన బెల్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ డెరెక్టర్ రజినీశ్ శర్మకు, ఆ సంస్థ ప్రతినిధి సంజయ్ అగర్వాల్ కు ధన్యవాదాలు తెలియజేశారు. పాలసముద్రం చెరువు అభివృద్ధికి కూడా సహకరించాలని కోరారు. పెనుకొండలో రూ.12 కోట్ల సీఎస్ఆర్ ఫండ్స్ తో ఐటీఐ కళాశాల నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో విస్త్రృతంగా పరిశ్రమల స్థాపనతో సీఎస్ఆర్ ఫండ్స్ వెల్లువెత్తుతున్నాయన్నారు. దీనివల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయలను, అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.
*వాళ్లకు సీఎస్ఆర్ అంటే తెలిసా..?*
రాయలసీమను పారిశ్రామిక హబ్ గా సీఎం చంద్రబాబు అభివృద్ది చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పరిశ్రమలు నెలకొల్పొతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్, దాల్మియా సిమ్మెంట్ పరిశ్రమ విస్తరణ, రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ, యుద్ధవిమానాల తయారీ పరిశ్రమ, కియా కార్ల పరిశ్రమ సహా సోలార్ , డ్రోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ పరిశ్రమల స్థాపనతో ఆదాయం, ఉపాధి అవకాశాలతో పాటు సీఎస్ఆర్ ఫండ్స్ అనే ఫలాలు కూడా అందుతున్నాయన్నారు. పరిశ్రమలు అందజేసే సీఎస్ఆర్ నిధులతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గత పాలకులకు సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకునే అవగాహన కూడా లేదన్నారు. వైసీపీ నాయకులకు సీఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏమిటో తెలియదు… దోచుకోవడం దాచుకోవడం తప్ప వారికేం తెలుసు..? అంటూ మంత్రి సవిత ఎద్దేవా చేశారు.
*కియాపై జగన్ కుట్ర*
పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమతో వేలాది మందికి ఉపాధి లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఎంతో శ్రమ కోర్చి కియా పరిశ్రమను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయలేని అసమర్థ జగన్… కియా పరిశ్రమను వెళ్లగొడతానని కుట్ర పన్నారన్నారు. కాని, ఆయన వల్ల కాలేదన్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, యువతకు ఉపాధి కల్పించాలని, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలని సీఎం చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.
ఈ నెల 22న తల్లికి వందనం అమలు
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో ఈ భాగంగా ఈ నెల 22వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఇంటిలో ఎందరు చదువుకున్న బిడ్డలుంటే, అందరికీ తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. రొద్దం పెద్ద చెరువు అభివృద్దికి రూ.3.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. పెనుకొండ నియోజక వర్గంలో అయిదు అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యారన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ తో ఈ భవనాలను నిర్మించనున్నామన్నారు. అంతకుముందు రొద్దం మండల కేంద్రంలో పీహెచ్సీ భవన నిర్మాణ పనుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రి సవితకు, ఇతర ప్రజాప్రతినిధులకు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగత పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
*జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం*
