434/440 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా!…


434/440 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా!

నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు అంటూ కించపరిచిన మహిళా లెక్చరర్

సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్(17) అనే విద్యార్థి

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులతో జిల్లాలో రెండో స్థానం దక్కించుకున్న తరుణ్

కాలేజీలో 435 మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ తరుణ్‌ను కించపరిచిన ఓ మహిళా లెక్చరర్

అలా అవమానపరచడం కరెక్ట్ కాదని లెక్చరర్‌ను విజ్ఞప్తి చేసిన తరుణ్

నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై కొట్టి అవమానించిన లెక్చరర్

లెక్చరర్ ప్రవర్తనకు క్లాస్ అంతా నవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన విద్యార్థి

మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి, మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్

ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ అవమానించకూడదు, ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆమెకు తెలియాలి అంటూ తరుణ్ సూసైడ్ నోట్

ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఇది ప్రజలందరికీ తెలియాలనే ఇలా చేస్తున్నానంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్న తరుణ్

About The Author