ముష్కరుల దుశ్చర్య.. 12మంది జవాన్లు మృతి…

ముష్కరుల దుశ్చర్య.. 12మంది జవాన్లు మృతి

పుల్వామా: జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు.

అవంతిపొర సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీలతో కాల్పులు జరిపిన అనంతరం ఐఈడీతో దాడులు చేశారు. ఈ ప్రమాదంలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై తామే దాడి చేసినట్లు జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన ఓ ఆటోరిక్షాలో ఐఈడీని ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అక్కడికి రాగానే ఆ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేశారు.

పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం ముక్కలు ముక్కలైంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం తొలుత తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఆ తర్వాత గ్రనేడ్లతో పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది.

About The Author