మన జవాన్లను చంపింది వీడే…

మన జవాన్లను చంపింది వీడే..

శ్రీనగర్.. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో ఉగ్రవాది అదిల్ అహ్మద్ మాట్లాడుతూ.. తాను ఏడాదిపాటు జేఈఎంలో పనిచేస్తున్నానని, ఈ వీడియోను అందరూ చూసే సరికి తాను స్వర్గంలో ఉంటానని పేర్కొన్నాడు.

జైషే జెండా ముందు ఆటోమెటిక్ రైఫిల్స్ తగిలించుకుని కనిపించిన అదిల్.. కశ్మీర్ ప్రజలకు తాను ఇచ్చే చివరి సందేశం ఇదేనని పేర్కొన్నాడు.

భారత్‌కు వ్యతిరేకంగా దక్షిణ కశ్మీర్ ప్రజలు పోరాడుతున్నారని, ఇప్పుడు ఉత్తర, మధ్య కశ్మీర్ ప్రజలతోపాటు జమ్ము ప్రజలు కూడా తమతో రావాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు.

తమ కమాండర్లను కొంతమందిని చంపినంత మాత్రాన బలహీనపడిపోతామన్న పిచ్చి భ్రమలు మానుకోవాలని భారత్‌ను హెచ్చరించాడు.

About The Author