పాక్ గుండెల్లో దడ… ఐరాస సాయం కోసం వేడుకోలు..!

పాక్ గుండెల్లో దడ… ఐరాస సాయం కోసం వేడుకోలు..!

40 మంది భారత సైనికులను పొట్టన బెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో దాయాది దేశం పాకిస్తాన్‌కు దడ పట్టుకుంది.

ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఐక్య రాజ్య సమితి పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కి లేఖ రాశారు.

‘‘పాకిస్తాన్‌పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోంది.

దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను…’’ అని ఖురేషీ సదరు లేఖలో పేర్కొన్నట్టు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది

About The Author