తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లను ఆపుకోలేకపోయన సీఎం యోగి ఆదిత్యనాథ్‌…

https://m.facebook.com/story.php?story_fbid=2294340894136006&id=100006803523381

తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లను ఆపుకోలేకపోయన సీఎం యోగి #ఆదిత్యనాథ్‌

యావత్‌ భారతావనికి తీరని శోకం మిగిల్చిన పుల్వామా ఉగ్రదాడిపై ఎదురైన ఓ ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బోరుమన్నారు.

‘యువకే మాన్‌కీబాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం ఇంజనీరింగ్‌ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనకు మోదీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఉగ్రవాదం తుది దశకు చేరుకుందని, మోదీ ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకు కంకణం కట్టుకుందని సమాధానం ఇచ్చారు.

దీంతో హాల్‌లో విద్యార్థులంతా భారత్‌ మతాకీ జై.. జై జవాన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆదిత్యనాథ్‌.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

తన కర్చీఫ్‌తో కన్నీళ్లను తుడుచుకుంటూ ఆవేశంగా మాట్లాడారు.

About The Author