ఆటవీ శాఖ కు ప్రధమ బహుమతి…

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన -2019 (నుమాయిష్) సందర్బంగా ప్రభుత్వము తరపున వివిధ శాఖలు ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నిటిలో రాష్ట్ర ఆటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రధమ బహుమతి లభించింది. అలంకార విభాగంలో ఆటవీ శాఖకు ప్రధమ బహుమతి రావటం ఇది రెండవసారి.
ఆటవీ శాఖ అవార్డునుశాసన సభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా రేంజ్ అధికారి శ్రీ కంప శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారి ఎ. శివ ప్రసాద రావు , సెక్షన్ అధికారి శ్రీ ఎ బాలసీతారి అందుకున్నారు.
అటవీ శాఖ స్టాల్ ను ఆకర్షణీయంగా, అటవీ ప్రాధాన్యతను అందరికీ అర్ధం అయ్యేలా తీర్చిదిద్ధి మొదటి బహుమతి సాధించిన సిబ్బందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, pccf పీకే ఝా అభినందించారు.

About The Author