గోకర్ణేశ్వరుడనే ఆత్మ లింగము :

ఆత్మ లింగము : పరమేశ్వరుడు రావణునికి ప్రసాదించిన మహిమాన్వి త లింగము

సంపూర్ణ గోకర్ణ యాత్రా విశేషాలు , అక్కడి ఆలయాలు , వాటి చిత్రాలు

దయచేసి పూర్తిగా చదవండి

మీరు తెలుసుకుని అందరికీ తెలిసేలా దయచేసి షేర్ చేయండి

” సంభవామి యుగే యుగే ” ఫేస్ బుక్ పేజి ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.

గోకర్ణేశ్వరుడనే ‘మహాబలేశ్వరుని’ దేవాలయం
లంకానగరంలో ఉన్న రావణాసురుడి తల్లి ‘కైకసి’ నిత్యం సముద్రపు ఒడ్డున ఇసుకమట్టి తో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని “పార్థివలింగం” అంటారు. ఇటువంటి పార్థివలింగం పూజ అన్నింటికన్నా మిన్న అయినది. ఒక రోజు కైకసి ఎన్ని సార్లు పార్థివలింగాన్ని చేసినా సముద్రపు అలలు వాటిని నాశనం చేయసాగాయి. ఆరోజు పార్థివలింగాభిషేకం చేయకపోవడం వల్ల కైకసి కన్నీటి పర్యంతమవుతుంది. పార్థివలింగాభిషేకం తంతులో కన్నీరు పెట్టిన రావణాసురుడి తల్లి కైకసి నిత్యం పూజించుకోవడం కోసం రావణాసురుడు “పార్థివలింగం ఏమిటి నీకు శివుని ఆత్మలింగమే తెచ్చి ఇస్తానని” తన తల్లి తో చెప్పి కైలాసానికి వెళతాడు. రావణాసురుడు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, కేవలం ఆత్మలింగం కోసం కైలాసానికి వెళ్ళిన రావణుడు అక్కడ శివునితో పాటు ఉన్న పార్వతీదేవి అందాన్ని చూసి వచ్చిన విషయాన్ని మరిచి పార్వతీ దేవినే చూస్తున్న రావణుడుని “ఏం కావాలని?” అడుగుతాడు శివుడు. అప్పుడు రావణుడు “పార్వతి” కావాలని అడుగుతాడు. శంకరుని మనస్సు తెలుసుకున్న పార్వతి రావణుడుకి కొన్ని నిభంధనలను పెట్టి రావణునితో వెళ్ళడానికి అంగీకరిస్తుంది. వింధ్యా పర్వతాల ప్రాంతంలో పార్వతి రావణునితో “నాకు ఆకలిగా ఉన్నది వనములో దొరికే కొన్ని ఫలములు కావాలి” అంటుంది. అంతట రావణాసురుడు పార్వతిని ఒక చెట్టు క్రింద కూర్చోనమని చెప్పి ఫలములు తేవడం కోసం అడవిలోకి వెళతాడు. అక్కడ రావణాసురుడుకి పాతాళలోక రాజైన, మాయాసురుని పుత్రికైన “మండోదరి”కనిపిస్తుంది. పార్వతీ దేవి కంటే అందంగా ఉన్నమండోదరిని చూసి మోహించి, మండోదరి తోసహా తిరిగి పార్వతి దగ్గరకు వచ్చి “నాకు మండోదరే కావాలని” అడుగుతాడు . అప్పుడు వారిరువురినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళుతుంది పార్వతి. ఈ విధంగా ఆత్మలింగం రావణ రాజ్యానికి తేవాలనే మొదటి ప్రయత్నం బెడిసికొడుతుంది.

లంకకు చేరిన రావణుడు- మండోదరి లను చుసిన కైకసి తనకోసం తెచ్చిన” ఆత్మలింగ మెక్కడ? ” అని అడుగుతుంది. అప్పుడు రావణాసురుడు తిరిగి కైలాశం వెళ్లి శివుని మెప్పించి ఆత్మలింగం ఇవ్వమని కోరతాడు. శివానుగ్రహంతో రావణాసురుడు ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగి దాన్ని ఎత్తడం, జరపడం సాధ్యంకాదనీ పరమశివుడు ఆత్మలింగం ఇవ్వడానికి మునుపే రావణాసురుడికి ఒక నిబంధన పెడతాడు.

అయితే రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందని భావించి దేవాధిదేవతలు మహావిష్ణువును వేడుకొంటారు. దాంతో విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి క్రమంగా పద్దతి ప్రకారం అడ్డువేస్తూ వస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు. ఈలోగా విషయం తెలుసుకున్న నారదమునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి, “రావణాసురుడి వద్దనున్న ఆత్మలింగం తీసుకుని రావణ రాజ్యంలో కాకుండా (లంకలో కాకుండా మరెక్కడైనా) ఇంకెక్కడైనా భూమిపై పెట్టాలనీ, దానికి తగిన స్థలం ‘గోకర్ణ’ అనీ. పైగా గతంలో మీ తండ్రిగారైన మహాశివుడు భూమాతకు ‘ఆత్మలింగ’ ప్రతిష్ట గోకర్ణలో జరుగుతుందని మాటిచ్చారు కుడా!” అని చెప్పి, అందుకు నువ్వే సమర్దుడవని చెప్పి భూలోకానికి పంపిస్తాడు. రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణవేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన రావణుడు సంధ్యవార్చుకునేంతదాకా ఆత్మలింగాన్నిభూమిపై పెట్టకుండా పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఈ లింగం చాలా బరువుగా ఉండడం వల్ల తాను ఎక్కువసేపు మోయలేననీ, మోయలేనప్పుడు మూడుసార్లు తమను పిలుస్తాననీ అయినప్పటికీ మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.

ఆ పరిసర ప్రాంతంలో మరెవ్వరూ లేకపోవడంతో గత్యంతరం లేక రావణుడు అందుకు అంగీకరించి, ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సంధ్య వార్చుకునేందుకు సముద్రం లోకి వెళతాడు. రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్ని మోయలేకపోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్యవార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు. ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై గట్టిగా మొట్టికాయ కొట్టగా అక్కడ గుంట పడుతుంది. ఇప్పటికి ఆ గుంటను మనం గోకర్ణ మహాగణపతి తలపై చూడవచ్చు.

ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు, తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం వల్ల వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో బలవంతంగా పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమం లో ఆత్మలింగం పై కప్పిన వస్త్రం అడ్డు రావడం వల్ల దానిని తీసి విసిరేస్తాడు. అది పడిన ప్రదేశమే “మురుడేశ్వర”. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం కవచం వల్ల చేతులు జారడం వల్ల కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే అది ” సజ్జేశ్వర” అనే ప్రదేశంలో పడుతుంది. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం పై నున్న మూత అడ్డు రావడం వల్ల దానిని తొలగించి విరిచి విసిరి వేస్తే అందులో ఒక ముక్క “గుణేశ్వర / గుణవంతేశ్వర్” లో, మరో ముక్క “ధారేశ్వర్” లో పడుతుంది. రావణాసురుడు ఆత్మలింగం పై ప్రయోగించిన బలం ఫలితంగా ఆత్మలింగం పైభాగం ఆవు చెవి ఆకారంలో సాగుతుందే కాని అది భూమినుండి ఊడిరాదు. కాల క్రమములో మహావిష్ణువు శాలిగ్రామ పీఠం రూపంలో ఈ ఆత్మలింగాన్నిచుట్టి ఉండడం జరుగుతుంది. గోకర్ణలోని భక్తులు ఈ మహాబలేశ్వరుని ఆత్మలింగాన్ని “శాలిగ్రామ పీఠం” లోని మధ్య భాగంలో వున్న గుండ్రని రంధ్రం లోనుండి తమ చేతులతో తాకుతారు. ఈ రంద్రం గుండానే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అత్యంత అరుదుగా ఆత్మలింగం పై గల ఈ శాలిగ్రామ పీఠంను తొలగించి ఎనిమిది రోజులు పుజిస్తారు. ఇట్టి కార్యక్రమాన్ని “అగమ్య అష్టబంధన మహోత్సవం” అంటారు. తదుపరి తిరిగి విష్ణు శాలిగ్రామ పీఠాన్ని యధాతధంగా పునః ప్రతిష్టాపన చేస్తారు. ఇది అతి అరుదుగా జరిగే కార్యక్రమము. ఈ కార్యక్రమం క్రీ.శ. 1903, 1930,1983 లో జరిగినవి.

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి

About The Author