వైఎస్ వివేకానందరెడ్డిది అసహజ మరణమా…?

వైఎస్ వివేకానందరెడ్డిది అసహజ మరణమా…?

వైఎస్ వివేకా మరణం పై పోలీసులకు అతని పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు…

వివేకా మరణం సమయంలో ఇంట్లో ఒంటరిగా వివేకా ఉన్నట్లు సమాచారం…

తలపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు…

అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదు…

దీంతో వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం చేసే అవకాశం….

పులివెందుల: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు

About The Author