సైకిల్ ఎక్కనున్న సీబీఐ మాజీ జేడి…?

సైకిల్ ఎక్కనున్న సీబీఐ మాజీ జేడి…?

జేడీ లక్ష్మీనారాయణ గా తెలుగు ప్రజలకు చిరపరిచితులైన వి.వి. లక్ష్మీనారాయణ IPS, రాజకీయ రంగ ప్రవేశంపై గతవకొంత కాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి… జేడీ గా చిరపరిచుతులు కాబట్టి, *జనధ్వని* అనే పార్టీ ని ఏర్పాటు చేస్తున్నారు అని, జనసేనలో చేరుతున్నారు అని, ఇలా రకరకాల పుకార్లు, షికారు చేశాయి…

అయితే లక్ష్మీనారాయణ మాత్రం నేరుగా ప్రజలను, రైతులను కలుస్తూ… రాష్ట్రమంతా పర్యటించి, తనకు మంత్రిగా అవకాశమొస్తే వ్యవసాయ శాఖనే కోరుకొంటాననే సంచలన వ్యాఖ్యలు చేసారు…

ఎన్నికల ప్రకటన వెలువడిన వేళ… అన్ని ఊహాగానాలకు తెరదించుతూ… లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు అయినట్లు, ,అటు పార్టీ ముఖ్యనేతలు, జేడీ సన్నిహితులు నిర్దారించారు…

అయితే లక్ష్మీనారాయణ రూపంలో పార్టీకి మరో సందిగ్ధ పరిస్థితి ఎదురు కానుంది….
భీమిలి నియోజకవర్గాన్ని తిరిగి ఆశిస్తున్న, మంత్రి గంటా శ్రీనివాసరావు ను విశాఖపట్నం ఎంపీగాను, భీమిలి టిక్కెట్టును అశోక గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మి కి దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో… లక్ష్మీనారాయణ కూడా భీమిలినే కోరుకోవడంతో… అధిష్టానానికి ఇదో సరికొత్త సవాలుగా చెప్పవచ్చు… ఏదేమైనా… రేపు జరిగే పార్టీ పోలిట్ బ్యూరో లో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.

— స్రవంతీ చంద్ర

About The Author