తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏప్రిల్ 5న డయల్‌ యువర్‌ ఈవో…


ఏప్రిల్ 5న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఏప్రిల్ 5వ‌ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, 2019 జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

———————————————

ఏప్రిల్ 9న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జూలై కోటా విడుదల

భక్తుల సౌకర్యార్థం 2019 జూలై నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 9న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో

About The Author