12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు..మొదటిసారి గ్రేడింగ్‌ విధానం అమలు..


ఇంటర్మీడియట్‌ ఫలితాలను ఈనెల 12న సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి  బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటరు ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరానికి గ్రేడింగ్‌ విధానం అమలు చేయగా.. ఈసారి రెండో ఏడాది ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటరు విద్యాశాఖ గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27నుంచి ప్రారంభమైన పరీక్షలు మార్చి 18తో ముగిశాయి.

About The Author