తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం…

BHASHYAKARULA UTSAVAM COMMENCES
తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం.

ఏప్రిల్ 30, తిరుమల 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభమైంది. మే 18వ తేదీ వరకు 19 రోజులపాటు ఈ ఉత్సవం జ‌రుగ‌నుంది. మే 9వ తేదీన శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వ‌హిస్తారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భాష్యకారుల ఉత్సవం మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author