తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం…

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల గందరగోళం నేపథ్యంలో రీవెరిఫికేషన్‌ ఫలితాల బాధ్యతపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబరీనా సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ సంస్థతో పాటు మరో సంస్థకు ఫలితాల వెల్లడి బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. మరో ఏజెన్సీ ఎంపిక బాధ్యత తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌)కు అప్పగించింది. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు.

About The Author