తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్… రేవంత్ రెడ్డి మిస్సింగ్…

మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకొన్న తెలంగాణ కాంగ్రెస్… ఆ తర్వాత, గెలిచిన తన ఎమ్మెల్యే లను కనీసం ఆరు నెలలు కూడా తమతో ఉంచుకోలేకపోయింది.

అయితే, సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి ముచ్చటగా మూడు ఎంపీ స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్… తెలంగాణలో తిరిగి తమ ప్రాభవాన్ని పొందడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్ లో… అసలే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ… అందునా ఉత్తంకుమార్ రెడ్డి సారధ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవం తర్వాత అతని నాయకత్వం పై బహిరంగ విమర్శలు చేసిన వారికి కొదవే లేదు.

కానీ అధిష్ఠానం మాత్రం ఉత్తం సారధ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలని నిర్దేశించింది… ఇక తాజా రాజకీయ పరిస్థితుల్లో… పిసిసి పగ్గాలకోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు…

ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వాన్ని ఆశిస్తున్న వారిలో ఎంపీలుగా గెలిచిన కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ముందువరసలో ఉన్నారని చెప్పవచ్చు…

ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్, సోనియా గాంధి, ప్రియాంక వాద్ర, సీనియర్‌ నాయకుడు సుబ్బరామిరెడ్డి లతో ఉమ్మడి నల్లగొండ ఎంపీలు దిగిన ఫోటోలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేకపోవడం పలు ఊహాగానాలకు తెరతీస్తోంది…

#Congress #TPCC #TELANGANA_CONGRESS #REVANTH_REDDY

About The Author