కుక్కను రేప్ చేసిన కామాంధులు…

కొన్ని చదవటానికే వికారంగా అనిపిస్తయ్… చదివేకొద్దీ వాంతి చేసుకోవాలన్నంత ఫీలింగూ… ఛీ, ఏం మనుషులం మనం అని ఒక్కసారిగా ఏవగింపు, చీదర వంటి భావాలు చుట్టుముడతయ్… ఇదుగో ఇదీ అలాంటిదే… ముంబైలోని మాల్వానీ ఏరియా… ఓ వీథిలో ఒకామెకు పొద్దునే మూలుగులు వినిపిస్తే, తలుపులు తీసి, బయటికొచ్చి చూసింది… ఓ కుక్క అక్కడుంది… మూలుగుతుంది… ఏడుస్తున్నది… దాని వెనుకభాగం అంతా రక్తం… మర్మస్థానం వద్ద కూడా… ఆమెకు ఏమీ అర్థం కాలేదు… ఇంట్లో మిగిలిన ఫుడ్డేదో తీసుకొచ్చి పెట్టింది… తినలేదు… భరించరాని నొప్పితో అది మూలుగుతూనే ఉంది… ఈలోపు ఓ ఆటో డ్రైవర్ వచ్చి అసలు విషయం చెప్పాడు ఆమెకు… రాత్రివేళ తనకు కుక్క అరుపులు వినిపిస్తుంటే, అటువైపు వెళ్లాడట.., ఒకడు కుక్క కాళ్లు కట్టేసి, అత్యాచారం చేస్తున్నాడు… తను మొదట షాక్ తిని, ఆటోలో రాడ్ తీసుకుని బయటికి దిగాడు… అక్కడున్న నలుగురు పారిపోయారు… తీరా కుక్క దగ్గరకు వెళ్లి చూస్తే అదీ దుస్థితి… ఆ నలుగురు డ్రగ్స్ తీసుకునో, తప్పతాగో ఉన్నట్టు కనిపించారట… అంటే మెదడంతా కమ్మిన మైకం, దానికితోడు పెట్రేగిన కామం… ఆ నలుగురికీ ఆ కుక్క (అదీ మగకుక్క) ఆ టైంలో కనిపించింది… సామూహికంగా రేప్ చేశారు…

ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన కుక్క చనిపోయింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులు పెట్టిన చిత్ర హింసలు, నొప్పి భరించలేకే ఆ శునకం చనిపోయిందని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మహారాష్ట్రలోని మలాడ్ పశ్చిమలో వున్న మల్వానీ ప్రాంతంలో జరిగిన ఈ అమానవీయ ఘటన వివరాలను పరిశీలిస్తే,ఈనెల 20వ తేదీన మల్వానీ ప్రాంతానికి చెందిన నలుగురు కామాంధులు మద్యం మత్తులో కళ్లు మూసుకుని పోయి అత్యంత హేయంగా కుక్కపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ శునకాన్ని లైంగికంగా తీవ్రంగా వేధించి వికృతానందం పొందారు.రోజూ ఇంటికి వచ్చే కుక్క ఆ రోజు ఆహారానికి ఇంటికి రాకపోవడంతో ఓ యువతి వీధిలో వెతుక్కుంటూ వెళ్లింది. అపుడు ఓ చర్చికి సమీపంలో కుక్క మూలుగుతుండం చెవికి వినిపించింది. వెంటనే అక్కడికి చేరుకోగా.. రక్తపు మడుగులో ఉన్న మూగజీవాన్ని చూసి ఆమె షాక్‌కు గురైంది.తక్షణం తన స్నేహితుల సహకారంతో ఆ కుక్కను సమీపంలో ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. మర్మాయవాల వద్ద తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్ని చూసిన వైద్యులు నిర్ఘాంతపోయారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అమానవీయ విషయం వెలుగులోకి వచ్చింది. శునకంపై మద్యం మత్తులో ఉన్న నలుగురు దుండగులు అత్యాచారం చేశారని తేలింది. శునకం నోరు కట్టేసి.. లైంగికంగా చిత్రహింసలకు గురిచేశారని వెల్లడైంది. ఈ దారుణ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నలుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తన్నారు.

About The Author