ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జులై 17వ తేదీన కన్వర్ యాత్ర…


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జులై 17వతేదీన నిర్వహించ తలపెట్టిన కన్వర్ యాత్రలో డీజేకి అనుమతించాలని, కానీ సినిమా పాటలు కాకుండా కేవలం భజనగీతాలే వేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులకు భద్రత కల్పించాలని, భక్తులపై హెలికాప్టరు నుంచి పూలు చల్లించాలని సీఎం యోగి ఆదేశించారు. కన్వర్ యాత్రలో పాల్గొనే మహిళలకు రక్షణ కల్పించాలని, ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. శివాలయాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ సందర్భంగా యాత్ర మార్గంలో మద్యం, మాంసం విక్రయించకుండా చూడాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

About The Author