హాస్టల్‌ గదుల్లో ఒంటరిగా ఉండొద్దు… ఉంటే నాలాగే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు…


‘హాస్టల్‌ గదుల్లో ఒంటరిగా ఉండొద్దు. ఉంటే నాలాగే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కనీసం ఒక గంట ఆడుకోవడానికి వెళ్లండి’ అని లేఖ రాసి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జలంధర్‌లోని పంజాబ్‌ లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి సోమ భరత్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భరత్‌ ప్రస్తుతం ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం (ఈసీఈ) చదువుతున్నాడు. ఇటీవల పరీక్షల్లో ఆశించిన గ్రేడ్‌ రాకపోవడంతో మరోసారి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చదువుల్లో వెనుకబడ్డాననే మనస్తాపంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. తన మరణాన్ని తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారో అని లేఖలో రాసిన భరత్‌.. ఆత్మహత్య చేసుకునేవాళ్లు పిరికివాళ్లు కాదని, దానికి ధైర్యం కావాలని పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలూ లేవని లేఖలో స్పష్టం చేశాడు

About The Author