ఏపీ అసెంబ్లీలో టీడిపి ఎమ్మెల్యేలపై తొలి సస్పెన్షన్ వేటు…

ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తర్వాత గట్టిగా తమ వాదనలు వినిపిస్తున్న ముగ్గురు టీడీపీ సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించగా, స్పీకర్ ప్రస్తుత సభా సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు, అయితే సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేస్తుండటంతో మార్షల్స్ సాయంతో వారిని బయటకు పంపించారు.

సభా సంప్రదాయాలు పాటించని వారిన, ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకే కాకుండా, శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్‌ విప్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

#టీడీపి #టిడిపిఎమ్మెల్యేలసస్పెన్షన్ #ఏపి #ఏపిఅసెంబ్లి #వైసీపి #ముఖ్యమంత్రి #బుగ్గన

About The Author