జసిత్‌ను కిడ్నాప్‌ చేసింది బెట్టింగ్ ముఠా ..?


రాష్ట్రంలో సంచలనం కలిగించిన నాలుగేళ్ల బాలుడు జసిత్ కిడ్నాప్ క్రికెట్ బెట్టింగ్ మాఫియా పనేనని నిర్దారణ అయింది. దీని వెనుక పెద్ద ముఠాతోపాటు , బాలుడి బంధువుల హస్తం కూడా ఉంది .
మండపేటలో బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్‌ కిడ్నాప్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్‌ నయిమ్‌ అస్మీ తెలిపారు. ఆయన ఆదివారం తమ కార్యాలయంలో ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17 మంది బుకీలు ఈ కిడ్నాప్‌ సంఘటనలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో బాలుడి బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు దాచేందుకు ఉపయోగించిన స్థలాలను నిర్థారించామన్నారు.

About The Author