తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అమర వీరులకు నా నమస్సుమాంజలి.vivek


తెలంగాణాలో రాజకీయ అస్థిరత్వం తో పాటు నియంతృత్వ పోకడలు గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా పని చేయాలి కానీ నిరంకుశంగా వారి గొంతులని అనగ తొక్కాలని చూస్తుంది. అదే విధంగా తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుంది. తెలంగాణాలో అభివృద్ధి అనేది కొందరి కుటుంబాలకి మాత్రమే పరిమితమైంది. ప్రజలకు మాత్రం ప్రభుత్వ పధకాలు నీటి మీద రాతలుగా మిగిలాయి. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని, ప్రాణాలను సైతం వదిలిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. మాటల గారడితో , ప్రచారాలతో ప్రజల మెప్పు పొందటం ప్రతీసారి సాధ్యం కాదు. మార్పు అనేది రావాలి , నిజమైన తెలంగాణ ప్రజావాణి వినిపించాలి.

బంగారు తెలంగాణ అనేది మాటలలో కాదు , చేతలలో చూపించాలి. ఇది కేవలం బీజేపీ తో మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నాను.

తెలంగాణ ప్రజానీకానికి మరింత చేరువగా ఉండి ప్రజల గొంతును గట్టిగా వినిపించేందుకు ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులైన అమిత్ షా గారి సమక్షంలో చేరడం జరిగింది.

తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా నాతో పాటు కలిసి ప్రయాణం కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

జై తెలంగాణ !

About The Author