ఈ నెల 16 న సీఎం జగన్ అమెరికా పర్యటన…


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 16 నుంచి 22 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 15న రాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
తిరిగి 24న ఉదయం విజయవాడకు చేరుకోనున్నట్లు తెలిపారు. ఇది వ్యక్తిగత పర్యటన అయినందు వల్ల ఈ పర్యటన ఖర్చును ముఖ్యమంత్రే వ్యక్తిగతంగా భరించనున్నట్లు పేర్కొన్నారు. జగన్‌ తన చిన్న కూతురిని అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో చేర్చేందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. దీంతో పాటు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.

About The Author