సీఎం శ్రీ కేసీఆర్‌ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి…


ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ లో ఇవాళ పర్యటించనున్నారు. గజ్వేల్‌ మండలం కోమటిబండగుట్టపై నిర్మించిన మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ బుధవారం సందర్శించనున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భగీరథ కేంద్రాన్ని మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. పథకం తీరుతెన్నులను సీఎం స్వయంగా వారికి వివరించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో కోమటిబండ ప్రాంతంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

గుట్ట సమీపంలో శాశ్వత హెలీప్యాడ్‌ నిర్మించారు. ఇక్కడ్నుంచి సంప్‌హౌస్‌ ప్రధాన ద్వారం వరకు ప్రత్యేక రోడ్డు నిర్మించారు. సంప్‌హౌస్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మిషన్‌ భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. హరితహారం, మిషన్‌ భగీరథపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. సీఎం పర్యటన నేపథ్యంలో కోమటిబండ మిషన్‌ భగీరథ కేంద్రం ప్రాంగణాన్ని పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

About The Author