లలితా జ్యెయెలరీలో దొంగలు పడ్డారు

ప్రముఖ నగల వ్యాపార సంస్థ లలితా జ్యెయెలరీలో దొంగలు పడ్డారు. భారీ మొత్తంలో నగలు దోచుక్కెళ్లారు. తమిళనాడులోని తిరుచ్చి నగరంలో  (బుధవారం) తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది.

షాపు వెనుక భాగంలో రంధ్రం చేసిన దొంగలు పిల్లి, కుక్క మాస్కులు ధరించి లోపలికి చొరబడ్డారు.

ఉదయం షాపు తెరిచిన సిబ్బందికి ఖాళీ అరలు కనిపించాయి. దొంగలు బంగారు, వజ్రాల నెక్లెసులను మొత్తం దోచెకెళ్లారు. గ్రౌండు ఫ్లోరులోని అరలన్నింటీ ఖాళీ చేశారు. దాదాపు 100 కేజీల బంగారు, వజ్రాల నగలు పోయాయని సిబ్బంది చెప్పారు. వీటి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా.

About The Author