తిరుమల మొదటి ఘాట్ రోడ్డు గాలి గోపురం వద్ద ప్రమాదం

తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు గాలి గోపురం వద్ద ప్రమాదం జరిగింది. పిట్ట గోడను ఢీ కొని ఇండికా కారు లోయలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా భక్తులు రంగారెడ్డి జిల్లా కందుకూరు వాస్తవ్యులుగా సమాచారం. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. సంఘటన స్థలానికి థర్డ్ సెక్టార్ ఏవిఏస్వో చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

About The Author