బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి వాల్మీకి మహాత్మ గాంధీ సంకల్ప పాదయాత్ర.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి వాల్మీకి మహాత్మా గాంధీ సంకల్ప పాదయాత్రలో భాగంగా, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడు మురహర రెడ్డి అధ్యక్షతన బిజెపి జిల్లాఅధ్యక్షులు,
మంత్రాలయం ఇంచార్జి నాయకులు,సీనియర్ న్యాయవాదులు పురుషోత్తం రెడ్డి పాల్గొని పట్టణంలో పెట్రోల్ బంక్ నుండి కూరగాయల మార్కెట్ మీదుగా శ్రీనివాస సర్కిల్, వైయస్సార్ సర్కిల్, సోమప్ప కూడలి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సోమప్ప కూడలిలో ప్రచార రథం పై వారు మాట్లాడుతూ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో కేంద్ర ప్రభుత్వం నిధులు లక్షల కోట్లు దండుకున్నారు అని, తెలుగుదేశం పార్టీని అవినీతి ప్రభుత్వంగా చిత్రీకరించి, ఓట్లను కొల్లగొట్టి కొత్తగా ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ ప్రభుత్వం రీ టెండరింగ్ విధానంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, కోట్లు దండుకోవడం చూస్తున్నారని, ఓటు వేసి మనమే తప్పు చేశామని విమర్శించారు. ఈసారైనా నిజాయితీగల మన బీజేపీ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

About The Author