క్యాన్సర్ ముందస్తు నిర్దారణ వైద్య పరీక్షల సంచార వాహనాన్ని ప్రారంభించారు…

 

క్యాన్సర్ ముందస్తు నిర్దారణ వైద్య పరీక్షల సంచార వాహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలోని జిఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ , క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎంపీ మురళీమోహన్ ఎంపీలాడ్స్ నిధులతో ఈ వాహనాన్ని సమకూర్చారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండనున్న ఈ వాహనంలో ఏర్పాటు చేసిన అల్ట్రా సౌండ్ , మామ్మో గ్రఫి , డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రాథమిక దశలోనే సర్వైకల్ , బ్రెస్ట్ క్యాన్సర్‌లను గుర్తించే విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అపోహలు తొలగించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపైనా ఉందని అన్నారు. అందుకు తగిన వేదిక ఏర్పాటు చేయడంలో ప్రయివేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవాలని సూచించారు.

About The Author