శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 6.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు…


కర్నూలు: కృష్ణా రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 6.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. నాగార్జునసాగర్‌ నుంచి 4.20 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఏక్షణమైనా సాగర్‌ నుంచి 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉంది.
వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని జలవనరులశాఖ తెలిపింది. పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. 16 గేట్లను అధికారులు ఎత్తివేశారు. పులిచింతల నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు అన్నీ ఎత్తివేశారు. 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌ నుంచి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

About The Author