సైనికుల దీపావళి వేడుకలో మోడీ…


ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈసారి కూడా దీపావళి వేడుకలను సైనికులతో కలసి జరుపుకుని ఆయన తన సంప్రదాయాన్ని కొనసాగించారు.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోదీ గారు దీపావళి వేడుకలు సైనికులతో జరుపుకుంటూ వారిలో స్ఫూర్తి నింపుతున్నారు.

జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో సైనికులతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ గారు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

చారిత్రాత్మక 370 అధికరణం రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొదటిసారి దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూకాశ్మీరులో అడుగుపెట్టారు.నరేంద్ర మోదీ గారు సైనికులకు స్వీట్లు పంచి వారితో సంతోషంగా గడిపారు.

సైనికులు ప్రధాని మోదీ గారు రావడంతో తమ ఆనందానికి అవధులు లేవని పారవశ్యంతో భావోద్వేగానికి గురయ్యరు.సైనికులు ఈ దీపావళి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేమని వారు వారి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ రోజు యాదృచ్చికంగా ఆర్మీకి సంబంధించిన “ఇన్ఫాన్ట్రీ డే సెలెబ్రేషన్స్”వేడుకలు కావడం మరింత విశేషం.

About The Author