తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆగంతకుడు..


రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవంగా దహనమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్ విజయ మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆగంతకుడు తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రంగారెడ్డిలో ఘోరం.. మహిళా తహసీల్దార్ విజయ రెడ్డి దారుణ హత్య

జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
కాగా.. ఈ ఘటన భోజన విరామ సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.* జనం తక్కువగా ఉన్న టైమ్‌లో ఆఫీసులోకి చొరబడిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

About The Author