పారదర్శకత కోసమే ఆన్ లైన్లో ఇసుక…


పారదర్శకత కోసమే ఆన్ లైన్లో ఇసుక అన్నారు. కానీ అదే ఆన్ లైన్ సాక్షిగా ఎవరెవరో… ఎక్కడెక్కడికో ఇసుకను తరలించుకుపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నా, పక్క గ్రామాలకు కానీ, దగ్గరలోని పట్టణాలకు కానీ గుప్పెడు ఇసుక అందటం లేదు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారు.
కానీ వైసీపీ నేతల అండదండలతో ఇసుక అక్రమ రవాణాకు కావలిసినంత ఇసుక దొరుకుతోంది. రేపల్లె మండలం రాజుకాల్వ నుంచి ఇసుకను అక్రమంగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్రాక్టర్లకు లోడ్‌చేసి విక్రయిస్తున్నారు. రాయపూడి, లింగాయపాలెం రేవు నుంచి అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్టు ఉంటోంది. కారణం ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నది వైసీపీ నేతలే అన్నది ప్రభుత్వానికి తెలుసు.

About The Author