తల్లిఒడికి చేరిన కిడ్నాప్ అయిన బిడ్డ.. అంతర్ జిల్లా కిడ్నాప్ ముఠా మహిళలు వీరే…


శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో కిడ్నాప్ అయిన పసిబిడ్డ ఎట్టకేలకు దొరికింది. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు పకడ్బందీగా చేసిన విచారణలో బిడ్డలను అపహరించే ఈ ముఠా ఒక వ్యూహం ప్రకారం రైళ్లు, బస్సులలో ప్రయాణిస్తుంటుందని అర్థమైంది. కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు తిరుపతికి చెందినవారు. బిడ్డలకోసం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తణుకులో రైలు ఎక్కి బెంగళూరుకు వెళ్తున్న కూలీ దంపతులతో మాటలు కలిపారు. కూలీల పరిస్థితి చూసి ముగ్గురు ఆడబిడ్డల్ని మీరు ఎలా సాకగలరని, చిన్న బిడ్డను తమకి అమ్మమని వల విసిరారు. అయితే ఇందుకు వాళ్లు ఒప్పుకోక పోవడంతో యథా ప్రకారం మాటలు కలుపుతూ వచ్చారు. కావలికి వచ్చేటప్పటికి బిడ్డల తల్లిదండ్రులు ఆదమరిచి నిద్రపోతుండే సరికి మూడో బిడ్డను తీసుకుని పారిపోయారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వాళ్లు ఎక్కిన బస్టాండ్ నుంచి దర్యాప్తు మొదలు పెట్టారు. నూజివీడుకి ఆ పాపాను అమ్మేందుకు పోవాలనుకుని నూజివీడు బస్సు ఎక్కి, ఒంగోలులో దిగి, మళ్లీ ఒంగోలునుంచి విజయవాడకు వెళ్లి, అక్కడినుంచి నూజివీడుకి వెళ్లారు. కిడ్నాపర్లను తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉండే షేక్ బీబీ, షేక్ నాగూర్ బీ గా గుర్తించారు. ఇద్దరికీ ఒకే మొగుడు. అతడి పేరు హుస్సేన్. తిరుపతి, నూజివీడు, భీమవరంలో వీళ్లకు ఇళ్లు ఉన్నాయి

About The Author