భర్త కన్నా ముందే చనిపోవాలని.. సమంగళిగా నిలిచిపోవాలని..


భర్తకు గుండెపోటు వచ్చిందని ఆందోళనకు గురై సమంగళిగా చనిపోవాలని సిందూజా అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. నారాయణపేట ప్రాంతానికి చెందిన సింధూజ నెల్లూరు రహమత్‌నగర్‌ ప్రాంతంలో నివసించే శివకుమార్‌ను వివాహం చేసుకొంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రైవేటు ఉద్యోగం చేసే శివకుమార్‌కు ఈ నెల 12న గుండెపోటు వచ్చింది. భర్త ఆరోగ్యం విషయంలో సింధూజ తీవ్ర ఆందోళనకు గురైంది.

తల్లి రత్నాదేవికి ఫోన్‌ చేసి తన భర్త కంటే ముందు తానే చనిపోతానంటూ ఏడ్చింది. ఆమెకు తల్లి ధైర్యం చెప్పింది. మానసికంగా కుంగిపోయిన ఆమె ఈ నెల 14న ఇంట్లో ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుంది. గమనించి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.

About The Author