గుర్తుతెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి

పీలేరు-తిరుపతి రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి చెందాడు.  సంఘటనా వివరాలు ఇలాఉన్నాయి. రాజస్తానుకు చెందిన రతన్ చౌదరి (30) అనే యువకుడు తన ప్రాంతానికి చెందిన మరికొందరితో పీలేరు పట్టణంలోని యల్లమంద క్రాస్ లో నివాసం ఉంటున్నాడు.  మూడు చక్రాల బండిపై ఐస్క్రీమ్ వ్యాపారం చేసుకోవడం ఇతనివృత్తి. ఈనేపథ్యంలో శుక్రవారం ఇతను స్కూటీలో తిరుపతికి వెళ్లి తిరిగి పీలేరుకు వస్తూ పట్టణ శివారులోని ఆయిల్ సీడ్స్ ఫ్యాక్టరీ ముందు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీ కొని వెళ్ళిపోయింది.  ఈఘటనలో రతన్ చౌదరి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. ఈమేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు.

About The Author