సీఎం కేసీఆర్కు చుక్కెదురు….


దిశను ఎందుకు పరామర్శించలేదని జాతీయ మీడియా నిలదీత
– సమాధానం చెప్పేందుకు నిరాకరించిన గులాబీ బాస్‌
#న్యూఢిల్లీ #బ్యూరో
దిశ ఘటన విషయంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. వివాహాలకు హాజరవుతున్నారని… బాధితురాలి కుటుంబీకులను మాత్రం కలవరా? అంటూ జాతీయ మీడియా ఆయనని ప్రశ్నించింది. కాగా, ఒక ప్రయివేటు ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే జాతీయ మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు
దిశ ఘటన దేశమంతా సంచలనం సృష్టించిందని… హైదరాబాదులో సైతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని స్పందించాలని సదరు విలేకరి కేసీఆర్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వకుండానే వెళ్ళిపోయారు

About The Author