ఫేస్‌బుక్ ప్రేమ…దివ్యాంగుడిని పెళ్లాడిన యువతి…


ఆమె అందానికి పర్యాయపదంలా ఉంటుంది. అనుకోకుండా ఓ దివ్యాంగుడిని ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించింది. పెద్దలు వద్దని చెబుతున్నా వినకుండా అతడినే పెళ్లాడింది. ఇదేం మూవీ స్టోరీ కాదు..నిజంగా కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన. కేరళ త్రిశూర్​ జిల్లాలోని తాజెకాడ్​కు నివశించే పవన్… ఆరేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణం పోలేదు కానీ తుంటి కింద భాగం మొత్తం చచ్చుబడిపోయింది. వీల్ ఛైర్ లేకపోతే అతడు ఎక్కడికి కదలలేదు. చిన్న, చిన్న అవసరాలకు సైతం పక్కవాళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయినా అతడు ఆత్మవిశ్వాసం కొల్పోలేదు. రకరకాల ఆలయాలకు వెళ్తూ, ఉత్సవాలలో పాల్గొటూ స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడిమోలు తిరువనంతపురానికి చెందిన షహానా అనే యువతి కంటపడ్డాయి. వెంటనే ఫేస్‌బుక్ ద్వారా ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుని అతడితో మాట్లాడింది. కొన్ని రోజుల తర్వాత అతడికి తన ప్రేమని వ్యక్తపరిచి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రణవ్‌కు షహానా అంటే ఇష్టమున్నా, తన పరిస్థితి దృష్యా వివాహానికి వెనకడుగు వేశాడు. అయినా షహానా పట్టు వీడలేదు. అతని కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది. ఇరు కుటుంబాలు నచ్చజెప్పినా వినలేదు. ప్రణవ్​ను డైరెక్ట్‌గా చూశాక కూడా ఆమె అతడినే పెళ్లి చేసుకుంటానని, బంధం మనసుకు సంబంధించినది అని చెప్పింది. దీంతో కొడుంగల్లూర్​లోని ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొని ఒక్కటైంది.

About The Author