తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం – టిటిడి ఈవో


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

        ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజురోజుకూ  ఉధృతంగా విస్త‌రిస్తున్న క‌రోనా (కోవిడ్ 19) వైర‌స్‌ను అరికట్ట‌డంలో భాగంగా శ్రీ‌వారి ఆల‌యంలోకి మార్చి 20వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం నుండి వారం రోజుల పాటు భ‌క్తుల‌ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం సాయంత్రం ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

        ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌ మేర‌కు, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని  గౌ.ముఖ్య‌మంత్రి వ‌ర్యులు శ్రీ వై.య‌స్‌. జగన్ మోహ‌న్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డిలతో సంప్రదించి  శ్రీవారి ఆలయంలోకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు తెలిపారు.ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ

About The Author