కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ను చర్యలు…

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ను చర్యలు చేపడుతూ ఉత్తర్వులు ఇచ్చిన సాధారణ పరిపాలన శాఖ…

సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లు గా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ…

ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం …

అటు హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లో ను రెండు గ్రూప్ లు గా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం…

గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని స్పష్టం

60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారు లు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు…

50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు…

ఏప్రిల్ 4 తేదీ వరకు ఇంటి వద్దే వైద్య ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం…

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం…

ఉద్యోగులు కు 9.30, 10, 10.30 గంటల వేర్వేరు షిఫ్టు లో హాజరుకు అనుమతి…

ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతి లభించిన ఉద్యోగుల ఈ-ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలని స్పష్టం…

ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవని స్పష్టం చేసిన ప్రభుత్వం

రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వతంత్ర్యప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుందని అదేశాల్లో పేర్కొన్న ప్రభుత్వం..

తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం..

వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి లేదని స్పష్టం
సచివాలయం, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు…

ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

About The Author