మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య

కలికిరి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండలం కేంద్రం కలికిరి టౌన్,  పాత సాయిబాబా గుడి వీధి కాపురాస్తులు అయిన మహమ్మద్ అనీఫ్ @ మధు, మస్తాని ల మూడవ కుమార్తె అయిన చిలిమి ఆయేషా బి(19 ) కు  ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహం అయ్యి తన భర్తతో గత సంవత్సరం విభేదాలు రావడం వలన సుమారు ఒక సంవత్సరం క్రితం మదనపల్లి నందు మత పెద్దల  సమక్షంలో తలాక్ (విడాకులు) తీసుకున్నట్లు అప్పటి నుంచి తన అమ్మమ్మ అయిన రహీమ బీ ఇంటినందు ఉంటున్నది.ఇటు తల్లిదండ్రులు మస్కట్లో వుండడం, తన బర్తతో విడిపోయి ఒంటరిగా జీవితం అనుబవిస్తున్నానని ఆయేషా బీ మనస్తాపం చెంది.  ఆదివారం ఉదయం 8:45 గంటల సమయంలో తను నివాసం ఉంటున్న అమ్మమ్మ ఇంటి మిద్దిపైన గల బాత్రూంలో రేకులకు క్రిందగల పైపులకు చీరతో ఉరివేసుకోగా గమనించి న ఆయేషా అక్క హసీనా చూసి అరవగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆయేషా బీ ని ఉరి నుంచి కిందకు దించి  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా డాక్టర్ పరీక్షించి (9.20 AM) అప్పటికే ఆయేషా బీ మరణించినట్లు తెలిపినాడు. ఈ విషయం పై ఆయేషా బీ చిన్నాన్న చిలిమి అబ్దుల్ ఖాదర్ కలికిరి పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు.

About The Author