రూ. 70 లక్షలతో ఉడాయించిన లారీ డ్రైవర్‌


సంగారెడ్డి : పటాన్‌చెరు వద్ద మిరపకాయల వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్‌ పరారీ అయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్‌లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్తున్న క్రమంలో మూత్ర విసర్జన కోసం పటాన్‌చెరు వద్ద లారీ దిగాడు. దీంతో లారీలోనే ఉంచిన రూ. 70 లక్షలతో లారీతో డ్రైవర్‌ ఉడాయించాడు. అప్రమత్తమైన బాధిత వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ వద్ద పోలీసులు లారీని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

About The Author