బ్రేకింగ్. రెడ్ జోన్ పరిధిలోకి పుల్లంపేట


మోటర్ బైక్ లో లిఫ్ట్ లు
ఇవ్వకండి.
అనుమతించిన వాహనాల్లో ప్రయాణికులను తరలించడం నేరం
డి ఎస్ పి నారాయణ స్వామి రెడ్డి

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట పెనగలూరు మండలాలను రెడ్ జోన్ గా ప్రకటించినట్లు డిఎస్పి నారాయణస్వామి రెడ్డి అన్నారు. పుల్లంపేట దొడ్లో పల్లి గ్రామంలో కరోనా వైరస్
పాజిటివ్ రావడంతో అతనితోపాటు.బంధువులను క్వా రం టైమ్ కు తరలించారు. పుల్లంపేట తో పాటు పెనగలూరు మండలాలను రెడ్ జోన్ పరిధిలోకి చేర్చారు.
మోటార్ బైకుల కొత్త వ్యక్తులకు ఇతరులకు లిఫ్టు ఇవ్వద్దని సూచించారు
ఆటోలు ఇతర వాహనాలు కూరగాయలు ఆహార పదార్థాలు మాత్రమే తరలించాలని ప్రయాణికులను తరలించడం నేరం అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాహనాల్లో ప్రయాణికులను తరలించడం ద్వారా ఇబ్బందులు తప్పవన్నారు
సామాజిక దూరం పాటించాలని. అనవసరంగా బయట తిరగ వద్దని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

About The Author