50 వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ14సిసిరోడ్లుప్రారంభించిన ప్రజాప్రతినిధులు

50 వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ 14 సి సి రోడ్లు 70 లక్షల రూపాయలతో ప్రారంభించిన ప్రజాప్రతినిధులు,అధికారులు

ఐదు వార్డులో ఐదు కోట్ల 4 లక్షల 75 వేల రూపాయలతో సీసీ రోడ్ల కి భూమి పూజ మూడు నెలల్లో పూర్తి, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 వార్డులు అభివృద్ధి చేస్తాం కమిషనర్ గిరీష,

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50 వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ నందు బుధవారం ఉదయం 70 లక్షల రూపాయలతో 14 రోడ్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కమిషనర్ మరియు అధికారులతో ప్రారంభోత్సవం చేశారు.

తిరుపతి శాసనసభ్యులు భువన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుపతి 50 వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ నందు 14 రోడ్లు సంబంధించి 70 లక్షల రూపాయలతో సిసి రోడ్లకు గత సంవత్సరం టెండర్లు పిలవగా 2020 జనవరిలో రాజీవ్ గాంధీ కాలనీ నందు భూమి పూజ చేసి నేడు పారన్ చేయడం చాలా సంతోషమని, నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా త్వరగా పూర్తిచేసే విధంగా నగరపాలక అధికారులకు మరియు కాంట్రాక్టర్ ఆదేశించామని తెలియజేశారు.

About The Author