ఈ పని మేము చేయలేము బాబోయ్…


అనంతపురం జిల్లా కదిరి 4.02.2021 ఇంటివద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహన డ్రైవర్లు నేడు వాహనాలు ఆపేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందొకటి చేస్తోందొకటని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్లో మున్సిపాలిటీ పరిధికి చెందిన వాహనాలన్నిటిని వాహన యజమానులు నిలిపి వేసి సమస్యలను ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు మోసం చేసిందని అధికారులు గానీ ప్రభుత్వం గానీ చెప్పిందొకటి చేస్తోందొకటని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు కేవలం డ్రైవర్ గా విధులు నిర్వహించాలని చెప్పి మూటలు మోసే నుంచి కార్డు దారులకు తూకాలు వేసే వరకు అన్ని పనులు తామే చేయాలంటూ అధికారులు ఆదేశాలిస్తూన్నారని,వార్డు వాలంటరీలు తమకు సహకరించలేదని, దీంతో తాము ఈ పని చేయలేమని మీడియాతో తెగేసి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం తమ. గోడును విన్నవించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బైట్… మాట్లాడుతున్న డ్రైవర్లు ఆటో యజమానులు .

About The Author