తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి జిల్లా , జూలై 08, 2026: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్ లో శిలాతోరణం వరకు వేచిఉన్న భుక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 24 గంటల సమయం పడుతోంది, రూ.300 టోకెన్ ఉన్న భక్తులకు 5 గంటల సమయం, దివ్య దర్శనం (పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు) సుమారుగా 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,706 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 34,838 మంది భక్తులు.
