ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఓయూలో బహుజన విద్యార్థి సంఘాల సంఘీభావం..!


తెలంగాణ రాష్ట్రంలో దొరల అహంకారానికి బహుజనుల ఆత్మగోరవానికి యుద్ధం మొదలైంది ఈ పోరాటంలో అంతిమ విజయం బహుజన నాయకుడు ఈటలదే…!!
తెలంగాణ బహుజన సమాజమాజంలోని సబ్బండ కులాలకు నాయకుడు ప్రజల మనిషి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మొదలుకొని ఇప్పటివరకు ఉస్మానియా విద్యార్థులకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటూ అక్కున చేర్చుకుని అన్నా అంటే తమ్మి అని స్పందించిన జన హృదయ నేత ఈటెల రాజేందర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయడం అంటే తెలంగాణ మెజార్టీ ప్రజల మనోభావాలను కించ పరచడమే అవుతుంది ఇది కేసీఆర్ దొర అహంకారానికి నిదర్శనం అని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు పేర్కోన్నారు. ఇక తెలంగాణ రాష్ర్టంలో దొర అహంకారానికి మరియు తెలంగాణ సబ్బండ కులాల సమాజానికి ప్రతీకగా ఉన్న ఈ ఈటెల రాజేందర్ గారి ఆత్మగౌరవానికి యుద్ధం మొదలైదని ఈ యుద్ధంలో అంతిమ విజయం మాత్రం ఆత్మగోరవానిదేననీ తెలంగాణ బహుజన సమాజం మొత్తము ఇక ఈటెల రాజేందర్ వెంటే ఉన్నారని తెలిపారు. ఇక ఈటెల రాజేందర్ గారు కూడా ఏ పార్టీ వైపు వెళ్లకుండా స్వతంత్రంగా ఉండి ఈ దొరల పాలనపై పోరాటం చేయాలని అప్పుడే ప్రజలు రాజేందరుగారిని అక్కున చేర్చుకుంటారని బహుజన విద్యార్థి సంఘాల నాయకులుగా మేము కూడా మిమ్ములను కడుపులో పెట్టి కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ *కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, అంబేద్కర్, శ్రీకాంత్,ప్రవీణ్, అంబేడ్కర్, ప్రశాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.*

About The Author