తెలంగాణలో బతుకమ్మ సంబరాలు!
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేపటి సెప్టెంబర్ 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బతుకమ్మ ప్రారంభ వేడుక లను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది, ఆదివారం వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడిలో వేడుకల ను ప్రారంభించి, 30 వ తేదీ న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించనున్నారు.
ఈ నేపథ్యంలోనే శనివారం కరీంనగర్ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పుష్పాలతో బతుక మ్మలను పేర్చి సాంప్రదాయ దుస్తులు ధరించి బతకమ్మ ల చుట్టూ తిరుగుతూ.. ఆడుతూ.. పాడుతూ. నృత్యాలతో సందడి చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, అన్నారు. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూ ర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయన కోరారు.
చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటకప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకో వాలని, ప్రకృతితో మమేక మైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడ్డబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.బతుకమ్మ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని ఆయన కోరారు